Trisha | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్,ప్రముఖ నటి త్రిష కృష్ణన్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ వస్తున్న పుకార్లు అభిమానులు, నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ రూమర్ల తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ ప్రచారాలపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా స్పందించింది లేదు. కానీ తాజాగా త్రిష సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లుగా ఆమె పోస్టు ఉండటంతో నెటిజన్లు దానిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రశాంతంగా నిద్రిస్తున్న తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు జత చేసిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. “నా విషయాల్లో ముక్కు పెట్టడానికి నేను అనుమతించే ఒకే ఒక్క ముక్కు ఇదే” అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యను చాలా మంది సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న రూమర్లకు ఇచ్చిన కౌంటర్గా భావిస్తున్నారు. త్రిష ఎవరినీ నేరుగా ఉద్దేశించి మాట్లాడకపోయినా, తన వ్యక్తిగత జీవితంపై నిరంతరం చర్చలు చేసే వారికి ఇది గట్టి సందేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అనవసర ఊహాగానాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ పెరుగుతున్న నేపథ్యంలో త్రిష ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల త్రిష చేసిన ప్రతి సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల మధ్య వైరల్ అవుతుండగా, ఈ తాజా పోస్ట్ కూడా భారీగా షేర్ అవుతోంది. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది రూమర్లకు ఇచ్చిన సూటి సమాధానమని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి, త్రిష తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రచారాలను పెద్దగా పట్టించుకోకుండా తనదైన శైలిలో స్పందించింది. ఈ పోస్ట్తో అయినా ఆమె గురించి జరుగుతున్న ఊహాగానాలు తగ్గుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.