సెకండ్ ఇన్సింగ్స్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది చెన్నై సోయగం త్రిష. ప్రస్తుతం ఈ భామ భారీ చిత్రాల్లో నటిస్తున్నది. త్రిష పెళ్లికి సంబంధించిన వార్త ఇటీవల వైరల్గా మారింది. ఓ మలయాళ నిర్మాతను ఆమె పెళ్లాడబోతున్నట్లు సోషల్మీడియాలో కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై స్పందించింది త్రిష. ‘అందరూ ప్రశాంతంగా ఉండండి. పుకార్లను ఆపే ప్రయత్నం చేయండి.
అసత్య వార్తల గురించి పట్టించుకోవద్దు’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో త్రిష పేర్కొంది. దాంతో పెళ్లి వార్తలన్నీ రూమర్లే అని తేలిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు దళపతి విజయ్ సరసన ‘లియో’ చిత్రంలో నటిస్తున్నది. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు త్రిష ఐడెంటిటీ, విడా ముయార్చీ, చతురంగ వట్టై చిత్రాల్లో నటిస్తున్నది.