చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తున్నది త్రిష. ఇప్పటికీ వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘96’ చిత్రంతో త్రిష కెరీర్ మరలా ఊపందుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం ఆమెకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో మహారాణి కుందవైగా ఆమె నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం త్రిష ‘రోడ్’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నది. మరోవైపు పదిహేనేండ్ల విరామం తర్వాత ‘లియో’ చిత్రంలో దళపతి విజయ్తో జోడీ కట్టింది.
ఇలా వరుస సినిమాలతో విరామం ఎరుగకుండా శ్రమిస్తున్నది ఈ చెన్నై సోయగం. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మరో మహిళా ప్రధాన చిత్రానికి అంగీకరించిందని తెలిసింది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి గౌరవ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తారు. విశేషమేమిటంటే.. ఈ సినిమాలో ముగ్గురు తమిళ అగ్ర హీరోలు అతిథి పాత్రల్లో నటించబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త చెన్నై సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.