త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా రూపొదుతోన్న కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’. మల్లి యేలూరి దర్శకుడు. డా.వై.జగన్మోహన్, నాగార్జున అల్లం నిర్మాతలు. మార్చి 7న సినిమా విడుదల కానుంది. రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించామని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని మేకర్స్ తెలిపారు.
సయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం, కెమెరా: వాసు, సంగీతం: ఆనంద్ మంత్ర.