త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. మధుబాల కీలక పాత్రను పోషించారు. స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీకాంత్ సిద్ధం రూపొందించారు. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీకాంత్ సిద్ధం చిత్ర విశేషాలు తెలియజేస్తూ “ప్రేమదేశం’ చిత్రం తొంభైల్లో యువతను ఉర్రూతలూగించింది. ఆ పేరును నిలబెట్టేలా ఈ సినిమాను తెరకెక్కించాం. తల్లీకొడుకు అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యువత మెచ్చే అన్ని అంశాలుంటాయి. మణిశర్మ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. పాటలు, టీజర్కు మంచి స్పందన లభిస్తున్నది. తల్లి పాత్రలో మధుబాల అద్భుతమైన నటను ప్రదర్శించింది. తనికెళ్ల భరణి పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది’ అన్నారు.