‘ట్రైలర్కు వచ్చిన స్పందన చూసి సినిమాపై నమ్మకం పెరిగింది. మేం చెప్పబోయే పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనిపించింది. ఎమోషన్స్, కామెడీ కలగలిసిన కథాంశం ఇది’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన అనుష్కతో జంటగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మహేశ్బాబు.పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 7 సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ- “కృష్ణాష్టమి రోజు సినిమా విడుదల చేస్తున్నాం.
కృష్ణుడిలాగే సినిమా కూడా అల్లరి అల్లరిగా ఉంటుంది. మహేశ్ కథ చెప్పినప్పుడు కాసేపు ట్రాన్స్లో ఉండిపోయా. కామెడీతో పాటు భావోద్వేగాలకూ ఈ కథలో కొదవలేదు. రీసెంట్గా ఓ టూర్ కూడా చేశా. ఈ సినిమా కోసం జనం ఎంతగా ఎదురుచూస్తున్నారో అప్పుడర్థమైంది. అనుష్కతో నటిస్తున్నానని తెలిసినప్పుడు బయటికి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదుగానీ, లోపల చాలా హ్యాపీగా ఫీలయ్యా. నా అభిమాన నటి ఆమె’ అన్నారు. ఈమధ్య కొన్ని షోలు వేసి చూసుకున్నామని, రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నామని దర్శకుడు మహేష్బాబు తెలిపారు.