Dilraju Became a Father Again | టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్రాజు ఒకరు. ఈయన నిర్మాణంలో సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అని ప్రేక్షకులు అంటుంటారు. సినిమాల విషయంలో ఈయన జడ్జిమెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దిల్రాజు మరో సారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి వైగా రెడ్డి బుధవారం తెల్లవారుజామున మగబిడ్డకి జన్మనిచ్చారు. దాంతో ఈయన ఇంట సంబురాలు మొదలయ్యాయి.
ఈయన మొదటి భార్య అనిత 2017లో హార్ట్ఎటాక్ రావడంతో మరణించారు. వీరికి హన్షిత జన్మించింది. ఇక హన్షిత కోరిక మేరకు దిల్రాజు 2020 లాక్డౌన్లో నిజామాబాద్లోని ఓ గుడిలో వైగారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ ‘దిల్రాజు అన్నా కాంగ్రాచులేషన్స్’ అని తెలుపుతూ.. ఆయనకు కొడుకు పుట్టాడని ట్విట్టర్లో వెల్లడించాడు.దిల్రాజు ప్రస్తుతం శంకర్-రామ్చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా దిల్రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనితో పాటుగా తలపతి విజయ్, వంశీ పైడిపల్లి వారసుడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
Dil Raju annaaaaaaaaaa congratulations 🏹🏂🏆was blessed with a baby boy 👦 @SVCCofficial
— BANDLA GANESH. (@ganeshbandla) June 29, 2022