కోవిడ్ మహమ్మారి ప్రభావం చాలా రంగాలపై పడ్డ సంగతి తెలిసిందే. వీటిలో ప్రత్యేకించి చెప్పాల్సింది సినిమా రంగం. కోవిడ్ ఎఫెక్ట్తో సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో సినీ పరిశ్రమలో పనిచేసే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లేకుండా పోయింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో రెండోసారి మూతపడ్డ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకునేందుకు తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. అయితే థియేటర్లు రీఓపెన్ అవుతున్నా కొత్త సినిమా విడుదల తేదీలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
లాక్డౌన్ ఎత్తివేసినా టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతానికి అనుకూలంగా లేవని నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా వెయిటింగ్ లిస్టులో పెట్టిన సినిమాలను వెంటవెంటనే రిలీజ్ చేసేందుకు రెడీగా లేనట్టు టాక్ నడుస్తోంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. థియేటర్లు ఓపెన్ అవడం మాట అటుంచితే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ను చూసిన జనాలు ఎంతవరకు మళ్లీ థియేటర్లకు వస్తారని కరెక్ట్ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు మళ్లీ భయం వీడి థియేటర్లకు వచ్చి, సినిమాలను ఆదరిస్తారని నమ్మకం కలిగేంత వరకు సినిమాలను విడుదల చేయకపోవడమే మంచిదని పలువురు ప్రొడ్యూసర్లు భావిస్తున్నారని చర్చ నడుస్తోంది.
డిజిటల్ ప్లాట్ఫాంలలో కూడా..
అంతేకాదు డిజిటల్ ప్లాట్ఫాంలలో కూడా తమ చిత్రాలను విడుదల చేసే విషయంలో తొందర పడొద్దని అనుకుంటున్నారట. కోవిడ్ ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత సినిమాల విడుదల విషయంలో ముందున్న నిర్మాతలు సెకండ్ వేవ్ అనంతరం మాత్రం వెంటనే డెసిషన్ తీసుకునేందుకు రెడీ లేరట. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుని పరిస్థితులు సద్దుమణిగి భద్రతా ప్రమాణాల విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాకే సినిమాలు విడుదల చేయాలని, ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని టాలీవుడ్ నిర్మాతలు ఫిక్స్ అయినట్టు ఇన్సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న