టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ను క్రికెటర్ సెహ్వాగ్తో పోలుస్తుంటారు. చేస్తే సెంచరీ..చేరితే పెవిలియన్ అన్నట్లుంటుంది సెహ్వాగ్ తీరు. పూరీ సినిమాలూ అంతే కొడితే సూపర్ హిట్ లేకుంటే ఫట్. దేశవ్యాప్త ప్రచారంతో హైప్ తీసుకొచ్చిన ‘లైగర్’ సినిమా ఫలితం ఈ దర్శకుడి శైలిని మరోసారి చూపించింది. దీంతో విజయ్తో చేయాలని తలపెట్టిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.
‘లైగర్’ ఫలితంతో పూరీ జగన్నాథ్ చేయాలనుకున్న సినిమాల లైనప్ మొత్తం మారిపోయిందని తెలుస్తున్నది. తాజాగా ఈ దర్శకుడు తన కొడుకు ఆకాష్తో ఓ చిత్రానికి ప్లాన్ చేసుకుంటారని తెలుస్తున్నది. ఆకాష్తో నిర్మాతగా సినిమాలు చేసిన పూరీ జగన్నాథ్..ఈసారి దర్శకుడిగా బాధ్యతలు భుజాన వేసుకుంటున్నారు. కొంత ఆలస్యమైనా బలమైన కథలతోనే సినిమాలు చేస్తానని ఇటీవల ‘లైగర్’ ప్రచార కార్యక్రమాల్లో ఈ దర్శకుడు చెప్పుకున్నారు. అలా మంచి కథలతో, రీజనబుల్ స్క్రీన్ప్లేతో పూరీ సినిమాలు చేస్తే తనతో పాటు ఇండస్ట్రీకి మంచిదే కదా.