ప్రముఖ టాలీవుడ్ (Tollywood) సినీ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి (86) (PC Reddy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 15న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో పీసీ రెడ్డి జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ను ప్రారంభించారు. అలనాటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.
ఆయన కెరీర్లో 75కుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. భలే అల్లుడు , మానవుడు దానవుడు, బడి పంతులు, విచిత్ర దాంపత్యం, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, పెద్దలు మారాలి, పట్న వాసం, అన్నా చెల్లెలుతోపాటు చాలా చిత్రాలకు దర్శకత్వం వహించారు. పి చంద్రశేఖర్ రెడ్డి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యుల ప్రగాడ సానుభూతి తెలియజేశారు.