Tollywood celebraties meeting | తెలుగు ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సినీ ప్రతినిధులు టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నిర్మాతలు నట్టి కుమార్, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ ,దర్శకుడు రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ్ లతో పాటు 24క్రాఫ్ట్స్కు చెందిన ప్రముఖుల పాల్గొన్నారు. ఈ భేటీలో కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఫిబ్రవరి 10న తెలుగు సీని ప్రముఖులు ఏపి సీఎం జగన్ను కలసి అదనపు షోలు ,టికెట్ రేట్ల విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై ఫిబ్రవరి మొదటి వారంలో క్లారిటి వచ్చే ఛాన్స్ ఉంది. చిరంజీవి, కొరటాలశివ, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, అర్ నారాయణ మూర్తీ, ఆలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సమావేశానికి హజరయ్యారు.ఏపి సీఎం వైఎస్ జగన్తో జరిపిన సమావేశం తర్వాత మెదటి సారిగా సినీప్రముఖుల భేటీ జరుగుతుంది.