Samantha | పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేయడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఊ అంటావా.. సాంగ్కు ఓకే చెప్పడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను సమంత బయటపెట్టింది. ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్-2024లో పాల్గొన్న సమంత.. తన వ్యక్తిగత విషయాలపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పుష్ప సినిమాలో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ పాట చేయడం.. తన దృష్టిలో ఫ్యామిలీమ్యాన్ వెబ్సిరీస్లో రాజీ పాత్ర చేయడం వంటిదే అని సమంత చెప్పింది. ఆ సమయంలో సలహాలు అడగడానికి మన చుట్టూ ఎవరూ లేకపోవడమే మంచిదని అనిపించిందని తెలిపింది. ఎందుకంటే తప్పులు చేయడం.. వాటి నుంచి కావాల్సిన మనోధైర్యాన్ని పొందడం అప్పుడే నేర్చుకున్నా అని చెప్పింది. తన గురించి తాను అన్వేషించుకునే క్రమంలోనే ఐటెం సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఊ అంటావా మొదటి షాట్ చూసి భయంతో వణికిపోయానని తెలిపింది.
అప్పట్లో తనపై తనకు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం ఉండేది కాదని.. ఇతర అమ్మాయిల్లా అందంగా కనిపించనని అనుకునేదాన్ని అని సమంత బయటపెట్టింది. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని అని చెప్పింది. గ్లామర్ విషయంలోనే కాదు.. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పింది. అయితే నటిగా ఎదుగుతున్న తరుణంలో తన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించానని చెప్పింది. ఇప్పటికీ వాటిని అధిగమించేందుకు పోరాడుతూనే ఉన్నానని తెలిపింది. ఒక రకంగా తన లోపల ఉండిపోయిన దెయ్యాలను అంతం చేసే అవకాశం వచ్చిందని పేర్కొంది. సిటాడెల్ వెబ్సిరీస్ను కూడా ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో చిత్రీకరించారని సమంత చెప్పింది. ఆ సమయంలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది. కానీ ఇప్పుడు తనను చూసి తాను ఎంతగానే గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చింద.ఇ
అయితే మళ్లీ స్పెషల్ సాంగ్స్ చేస్తారని మీడియా అడగ్గా.. మళ్లీ చేయనని చెప్పేసింది. అది తనకు ఇప్పుడు సవాలు ఎంత మాత్రం కాదని స్పష్టం చేసింది.