Pooja Hegde | ఇండస్ట్రీలో హీరోయిన్ దశ మారిపోవడానికి ఒక శుక్రవారం చాలు. హిట్టు వచ్చిన రోజు ఆమెను నెత్తిన పెట్టుకుంటారు. ఫ్లాప్ వస్తే మాత్రం తీసి పక్కన పెడుతుంటారు. ఈ రెండు చాలా త్వరగానే చూసింది పూజా హెగ్డే. రెండేళ్ల కింది వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియని అంత బిజీగా ఉంది పూజా హెగ్డే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డేట్స్ ఇద్దాం అంటే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్గా పరిణామాలు మారిపోతాయని బహుశా పూజా హెగ్డే కూడా ఊహించి ఉండదు.
ఎందుకంటే స్టార్ హీరోయిన్ హోదా ఉన్నా ఒక్క ఆఫర్ కూడా చేతిలో లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది బుట్ట బొమ్మ. తెలుగులో అయితే ఈమె పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒప్పుకున్న సినిమాలు మొదలు కావడం లేదు.. మొదలైన సినిమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆ మధ్య మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించారు. డేట్స్ ఇష్యూ రావడంతో ఒక షెడ్యూల్ తర్వాత ఆమె ప్లేస్ను శ్రీ లీల రీప్లేస్ చేసింది. దానికి ముందు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో మొదలైన జనగణమన సినిమా కూడా ఒక షెడ్యూల్ తర్వాత ఆపేశారు.
ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో అనౌన్స్ చేసిన గాంజా శంకర్ కూడా ఆదిలోనే ఆగిపోయేలా కనిపిస్తుంది. దాంతో మరోసారి ఖాళీ అయిపోయింది పూజా హెగ్డే. 2022 కు ముందు పూజా కెరీర్ సూపర్ ఫాస్ట్ గా ఉంది. దానికి ముందు ఆమె ఏ సినిమా నటించిన కూడా బంపర్ హిట్ కొట్టింది. కానీ 2022లో బీస్ట్, ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్ ఇలా నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో పూజాకు బ్యాడ్ టైం మొదలైపోయింది. ఇంక గతేడాది సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చినా కిసీకా కిసీకా జాన్ కూడా డిజాస్టర్ అయింది.
దాంతో బాలీవుడ్లో కూడా పూజా హెగ్డే వైపు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు దర్శక నిర్మాతలు. దాంతో ప్రస్తుతం ఈమె కెరీర్ ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదు. పూజా కెరీర్ గాడిన పడాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. మరి ఆ అద్భుతం చేసే దర్శకుడు ఎక్కడ ఉన్నారో చూడాలి.