Natasha Doshi | టాలీవుడ్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వరుసపెట్టి హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతున్నారు. గత నెల రోజుల్లో రకుల్తో సహా దాదాపు ఆరు జంటలు పెళ్లిల పీటలు ఎక్కగా.. తాజాగా మరో హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. నెల క్రితమే బిజినెస్మ్యాన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. ఆ ఫొటోలను తాజాగా బయటపెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? బాలకృష్ణ జై సింహాలో హీరోయిన్గా నటించిన నటాషా దోషి.
ముంబైకి చెందిన నటాషా దోషి మలయాళ చిత్రాలతో సినీ కెరీర్ను ప్రారంభించింది. 2012-17 మధ్య మలయాళంలో నాలుగు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2018లో నందమూరి బాలకృష్ణ జై సింహా సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. జైసింహా తర్వాత శ్రీకాంత్తో కోతల రాయుడు సినిమాలోనూ నటించింది. కానీ ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో నటాషాకు పెద్దగా ఆఫర్లు రాలేవు. కల్యాణ్ రామ్ ఎంతమంచి వాడవురా సినిమాలో స్పెషల్ సాంగ్లోనూ మెరిసింది. అటు మలయాళం, ఇటు తెలుగులో కలిసిరాకపోవడంతో 2020 తర్వాత సినిమాలను పూర్తిగా పక్కనపెట్టేసింది. ఆ తర్వాత బిజినెస్మ్యాన్ మనన్ షాతో ప్రేమలో పడింది.
బిజినెస్మ్యాన్ మనన్ షాను పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది జూలైలో ప్రకటించింది. తమ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని చెప్పి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 31వ తేదీన వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. దాదాపు నెల తర్వాత ఆ విషయాన్ని తెలియజేస్తూ నటాషా సోషల్మీడియాలో పోస్టు పెట్టింది. పెళ్లి ఫొటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ నటాషాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.