న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మదీపూర్ ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీ, గోడౌన్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు. మదీపూర్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్థుల భవనంలోని షూ తయారీ కర్మాగారంలో గ్రౌండ్ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల భవనాల్లో ఉన్న వారంతా బయటకు వచ్చారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.