Adivi Sesh About Marriage | ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అడివిశేష్. భారీ అంచనాల నడుమ జూన్ 3న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మేజర్ పాత్రలో అడివి శేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. అడివి శేష్కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది. ఇటీవలే ఈ చిత్రం రూ.60 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా అడివిశేష్ తన ప్రేమ, పెళ్ళి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
తాజాగా ఓ ఇంటర్వూలో అడివిశేష్ మాట్లాడుతూ ‘యూఎస్లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాను. నా పుట్టినరోజు నాడు తన పెళ్ళి అయింది. ఆ ఎఫెక్ట్ నాపై బాగా పడింది. ప్రేమలో దెబ్బతినడం వల్ల పెళ్ళిపై పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన పెళ్ళి కోసం ఇంటోవాళ్ళు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం అడివిశేష్ తన తదుపరి ప్రాజెక్ట్లపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘హిట్-2’ విడుదలకు సిద్ధంగా ఉంది. నాని నిర్మించిన ఈ చిత్రాన్ని సలైష్ కొలను దర్శకత్వం వహించాడు. దీనితో పాటుగా ‘గూఢాచారి’ సీక్వెల్లో చేస్తున్నాడు.