‘తొలి సీన్ నుంచి ైక్లెమాక్స్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. తెలుగులో ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు’ అన్నారు తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇష్క్’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకులముందుకురానుంది. యస్.యస్. రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రియాప్రకాష్ వారియర్ కథానాయిక. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్రాజు మాట్లాడుతూ ‘నా కెరీర్ ఆరంభంలో డిస్ట్రిబ్యూటర్గా నిలదొక్కుకోవడానికి సూపర్గుడ్ ఫిల్మ్స్ కారణమైంది. ‘ఇష్క్’ మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కరోనా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులందరూ మాస్క్లు ధరించి సినిమా చూడాలని కోరుతున్నా’ అన్నారు. ఈ సినిమా చూసిన వారందరూ థ్రిల్ ఫీలవుతారని దర్శకుడు తెలిపారు. వాకాడ అప్పారావు మాట్లాడుతూ ‘చిన్న సంఘటన ఆధారం చేసుకొని తీసిన సినిమా ఇది. నటీనటులు, సాంకేతిక వర్గం బాగా కుదరటం వల్ల సినిమా అద్భుతంగా వచ్చింది’ అన్నారు. తెలుగులో తనకిది రెండో చిత్రమని, లాక్డౌన్ తర్వాత వెండితెరపై సినిమా చూడబోతుండటం ఆనందంగా ఉందని కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పింది.