రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బొమ్మలకొలువు’. ఈ చిత్రానికి సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఏవీఆర్ స్వామి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను యూనిట్ వెల్లడించారు. నిర్మాత ఏవీఆర్ స్వామి మాట్లాడుతూ..‘థ్రిల్లర్ కథా చిత్రమిది. కరోనా సమయంలో ఆ పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్మించాం. ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. రచయిత వీబీఎస్ రవి అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి నాయిక మాళవిక, దర్శకుడు సుబ్బు తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం : ప్రవీణ్ లక్కరాజు.