రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్ పైకి అభిమానులు ఎక్కారు. ఎక్కువ సంఖ్యలో అభిమానులు కటౌట్ పైకి ఎక్కడంతో కటౌట్ కింద పడిపోయింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరు అవడంతో వాళ్లను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.