పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భళ్లాలదేవుడు రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని థియేటర్స్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. త్రివిక్రమ్ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది.
మలయాళ రీమేక్లో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించి పలులుక్స్ కూడా విడుదలయ్యాయి. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు ఫస్ట్ గ్లింప్స్ను ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అభిమానులు పవన్- రానా సినిమాకి భీమ్లా నాయక్ అనే టైటిల్ పెడతారని భావిస్తున్నారు.
చిత్రంలో పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ కాగా, ఆయన పాత్ర పేరునే సినిమాకి టైటిల్గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. చిత్రంలో రానా కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆయనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు.