Agent Movie Ott | ‘ఏజెంట్’ ఫలితం అక్కినేని ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకున్న అఖిల్కు ఈ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అవుతుందనుకుంటే.. తన కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. అసలు ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ‘ధృవ’ సినిమా తీసిన సురేందర్ ఏనా అనే డౌట్ కూడా ఎంతో మందికి వచ్చింది. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఈ సినిమా వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడలేదంటే ఈ సినిమా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాత అనీల్ సుంకర సైతం ఈ సినిమా ఫేయిల్యూర్ను ఎలాంటి భేషజాలకు పోకుండా ఒప్పేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 19నే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు డిజిటల్ ప్లాట్ఫార్మ్ సోనిలివ్ అధికారిక ప్రకటన చేసింది. అయితే చెప్పిన తేదికి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు. పోని ఏదో కారణాల వల్ల వారం పోస్ట్ పోన్ అయిందేమో అని అనుకున్నారు. కానీ అనౌన్స్మెంట్ ఇచ్చి పది రోజులైంది. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. దాంతో పలువురు నెటిజన్లు సోనిలైవ్ను టాగ్ చేస్తూ ఏజెంట్ ఇంకా ఎప్పుడొస్తుంది అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉందట. అదేంటంటే ఈ సినిమాకు మళ్లీ కత్తెర పని చెప్పినట్లు టాక్. చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్లు అనిపిస్తుంది ఈ వ్యవహారం చూస్తుంటే. ఎలాగూ ఫ్లాప్ సినిమానే. టాక్ కూడా నెగెటీవ్గా వచ్చింది. అలాంటప్పుడు ఒరిజినల్ వెర్షన్ను రిలీజ్ చేస్తే సరిపోతుందిగా.. మళ్లీ ఎడిటింగ్ ఎందుకు. థియేటర్లో మిస్సయిన వారు.. అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందా తెలుసుకోవడానికి ఒక సారి ఓటీటీలో చూడాలి అని ఎంతో ఆశగా ఎదురు చూశారు.
ఏప్రిల్ నెలలో ఎట్టి పరిస్థుతుల్లో సినిమాను తీసుకురావాలని ఎడిటింగ్కు సరిగా సమయం కేటాయించలేరట. దాని వల్ల అనవసరమైన సీన్లు, సాగదీసిని ఫైట్లు ఎక్కువయ్యాయని.. కాగా ఓటీటీలోనైనా ఏజెంట్కు మంచి ఆదరణ రావాలని మరోసారి ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నారట మేకర్స్. అంతేకాకుండా కొన్ని సీన్లను కూడా యాడ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇలానే ఇంకా ఆలస్యం చేస్తే ఓటీటీ ప్రియులు కూడా ఈ సినిమాను పక్కన పెట్టేస్తారని పలువును నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు హిప్ హాస్ తమిళ స్వరాలు సమకూర్చాడు. అయితే ఏ ఒక్క పాట కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఏకే ఎంటర్టైనమెంట్స్తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు.