కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ సంక్రాంతి రేసుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం ఇదే తొలిసారి కావడం విశేషం. అజిత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘తునివు’, విజయ్ ైస్టెలిష్ డ్రామా ‘వరిసు’ పొంగల్ రేసుకు రెడీ అవుతున్నాయి. ‘తునివు’ సినిమాను దర్శకుడు హెచ్ వినోద్ రూపొందిస్తున్నారు. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. మంజు వారియర్ నాయికగా నటిస్తున్నది.
తాజాగా ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. దీంతో చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘వరిసు’ సినిమా విషయానికొస్తే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. భారీ స్కేల్లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. విజయ్, అజిత్ కెరీర్లలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ రెండు చిత్రాల మధ్య పోటీ సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్నది.