తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అల్లరి నరేశ్, హరీశ్శంకర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఈవీవీ సత్యనారాయణ సినిమాలా ఉంటుంది. మగాడంటే ఏడవకూడదు.. బాధపడకూడదు అంటారు. కానీ మగాడు కూడా మనిషే. ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. ైక్లెమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల 17న సినిమా విడుదలయ్యాక, పాపం ప్రతాప్ కాస్తా వీరప్రతాప్ అనిపించుకుంటాడు’ అని నమ్మకంగా చెప్పారు.
ప్రతి మగాడికీ ఈ సినిమా ఓ కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుందని దర్శకుడు దుర్గ నరేష్ అన్నారు. టికెట్కి రెట్టింపు వినోదాన్నిచ్చే సినిమా ఇదని నటుడు అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందంతోపాటు దర్శకులు దశరథ్, సాయిలు కంపాటి, వీవీఎస్ రవి, ఈటీవీ ప్రతినిథి నితిన్ చక్రవర్తి కూడా మాట్లాడారు.