తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’. జి.జి.విహారి దర్శకుడు. రవి పనస నిర్మాత. పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘శరణమన్న శరణం’ అనే పాటను విడుదల చేశారు. మేడే సందర్భంగా శ్రామిక శక్తిని గౌరవిస్తూ ఈ పాటను రూపొందించారు.
హాయ్ కేపీ స్వరపరచిన ఈ పాటను కుమార వాగ్దేవి ఆలపించారు. శ్రామికులు ఆరాధించే గ్రామ దేవతలను భక్తిపూర్వకంగా స్మరిస్తూ, సబ్బండ కులాల శ్రమజీవుల గుండెచప్పుడుగా ఈ పాట ఆకట్టుకుంటుందని, మట్టి మనుషులను కంటికి రెప్పలా కాపాడే దేవతలకు వందనమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: హాయ్ కేపీ, కథ, దర్శకత్వం: జీజీ విహారి.