కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరు’ (Thiru). కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ (Mithran Jawahar) దర్శకత్వం వహించాడు. ఆగస్టు 18న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో రాశీఖన్నా, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే తమిళనాడులో ఓపెనింగ్ రోజు బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్లు గ్రాస్ వసూలు చేసిందన్న న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా తెలుగు వెర్షన్కు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. తిరు చిత్రం నైజాం ఏరియాలో రూ.10.5 లక్షలు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకున్నా తొలి రోజు ఇంత మొత్తం రావడం మంచి విషయమంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమాకు మంచి టాక్ వస్తుండటంతో వీకెండ్ నాటికి వసూళ్లు పెరిగే అవకాశముందంటున్నారు.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.