కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఎప్పటికపుడు అభిమానులకు కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). రొమాంటిక్, క్లాస్, మాస్..ఇలా ఏ జోనర్ అయినా ధనుష్ సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ స్టార్ హీరో మిత్రన్ జవహర్ (Mithran Jawahar) డైరెక్షన్లో నటించిన తాజా చిత్రం తిరు (Thiru).
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రాశీఖన్నా, నిత్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. కాగా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓపెనింగ్ డేను మంచి టాక్తో మొదలుపెట్టింది తిరు. తమిళనాడులో మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించిన వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తిరు తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్.
తిరు తెలుగులో కూడా విడుదలైంది. అయితే తెలుగులో ప్రమోషన్స్ తక్కువగా ఉండటంతో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.