సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరు మృతిని మరచిపోకముందే మరో సెలబ్రిటీ మరణ వార్త వినాల్సి వస్తుంది. తాజాగా సినీ దర్శకుడు త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభు కథానాయకుడిగా వెట్రిమేల్ వెట్రి, విజయకాంత్ హీరోగా మా నగర కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన.
ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గడంతో సొంతూరు అరుంబుకోటైకి వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదానికి గురైన త్యాగరాజన్ కోమాలోకి వెళ్లారు. కోలుకున్న తర్వాత చెన్నైకి వచ్చిన ఆయన స్థానిక వడప ళణి, ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కనే పడుకుని అమ్మా క్యాంటీన్లో తింటూ దీని పరిస్థితి అనుభవించారు. బుధవారం ఆయన కన్నమూయడంతో పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.