Veera simha Reddy | బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించాడు. దాంతో తిరిగి మళ్లీ ఒంగోలులోనే ల్యాండింగ్ చేశాడు. ప్రస్తుతం టెక్నీషియన్స్ లోపాన్ని సవరించేపనిలో ఉన్నారు. ఇక శుక్రవారం జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇదే హెలికాఫ్టర్లో బాలయ్య ఒంగోలుకు వచ్చాడు.
‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడుగా ఇటీవలే రిలీజైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేం గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.