అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ( రాంగోపాల్ వర్మ) మరోసారి ట్విటర్ ద్వారా స్పందించారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఐనాక్స్ థియేటర్లలో టికెట్ ధరను రూ . 2,200 వేలుగా విక్రయిస్తున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రూ.2, 200 అనుమతించిందని, ఏపీలో మాత్రం రూ. 200 అమ్ముకోవడానికి అనుమతుల్లేవా అని ప్రశ్నించారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఏపీలో ఉత్పన్నమవుతుందని’ ఆయన వ్యాఖ్యలు చేశారు. మహా ఐనాక్స్ మల్టీఫెక్స్లలో రూ. 2,200 వరకు టికెట్లు విక్రయిస్తోందని ఆయన వెల్లడించారు.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై వరుసగా సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ ట్విటర్ ద్వారా మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఏపీ సెక్రటేరియట్ లో వీరిద్దరి మధ్య కొనసాగిన సమావేశంలో ఆర్జీవీ తన దైన శైలీలో స్పందించారు.‘ తయారీదారులుగా సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతలకే ఉంటుందని,దాన్ని ఇంకొకరు తీసుకోవడం సరికాదని ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా వివరించారు. ఈ దశలో మరోమారు ట్వీటర్లో స్పందించిన ఆర్జీవీకి ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉండబోతున్నది వేచి చూడాల్సిందే