చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతిహాసన్ నాయిక. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నది. భారీ పోరాట ఘ ట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. సంక్రా ంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. డబ్బింగ్ ప్రారంభమైంది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘ఈ దీపావళికి బాస్ సినిమా టీజర్ రాబోతున్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేశాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్టైనర్ను థియేటర్లో చూడాలని ఉత్సాహంగా ఉన్నా’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు. వైజాగ్ నేపథ్య కథాంశంతో మాస్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ విల్సన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ దర్శకత్వం: రవీంద్ర (బాబీ).