సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకలు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా రెండు రోజుల పాటు వైభవంగా జరిగాయి. దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర తారలు ఈ వేడుకలో సందడి చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దక్షిణ భారత చిత్రాలను ప్రోత్సహించడానికి సైమా చక్కటి వేదికగా నిలుస్తున్నదని సైమా వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరిపేర్కొన్నారు.
2023 సంవత్సరానికిగానూ ఉత్తమ చిత్రం: సీతారామం, ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ నటుడు క్రిటిక్స్: అడవి శేష్ (మేజర్), ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా), ఉత్తమ నటి క్రిటిక్స్: మృణాల్ ఠాకూర్ (సీతారామం), ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ సంగీత దర్శకుడు : ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (నాటు నాటు ) అవార్డులను స్వీకరించారు.