స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ‘సంక్రాంతికి కలుద్దాం..’అంటూ చిత్ర బృందం పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. జీకే మోహన్ సహ నిర్మాత. పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్తో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం 40 శాతం షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణకు టీమ్ సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. మరికొద్ది రోజుల్లో సినిమా టైటిల్, టీజర్ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే : కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి, ఎడిటర్ : నిరంజన్ దేవరమానే, సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, సంగీతం : దేవిశ్రీప్రసాద్.