అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ద రూల్’ సినిమా షూటింగ్ సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా సెట్లో ఫొటో షూట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
దేశవ్యాప్తంగా ‘పుష్ప’ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ ద్వితీయ భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలు అందుకునేలా సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది.