అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ను శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించారు.
ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘చిరంజీవి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ ఈ సినిమా కోసం వినూత్నమైన కథను సిద్ధం చేశాడు. మాస్ను ఉర్రూతలూగించే కథ ఇది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వైజాగ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఎ విల్సన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ).