రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కస్’. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. నవ్వులు పూయించేలా సాగిన ఈ ట్రైలర్లో రణ్వీర్ ఎలక్ట్రిక్ మ్యాన్ పాత్రలో కనిపించి వినోదాన్ని పంచారు. సర్కస్లో అతనో ప్రత్యేక ఆకర్షణ. వందల వోల్ట్ల కరెంట్ తీగలను పట్టుకుని ఆటాడుతుంటాడు రణ్వీర్. సర్కస్కు వచ్చిన ప్రేక్షకులను అబ్బురపరుస్తుంటాడు.
పీరియాడిక్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రంలో గోల్మాల్ సిరీస్ ప్రస్తావన రావడంతో ఇది క్రాసోవర్ ఫిల్మ్గా తెరకెక్కించారని తెలుస్తున్నది. గతంలో ఈ తరహాలో సింగం, సింబా, సూర్యవంశీ వంటి పోలీస్ స్టోరీస్ తెరకెక్కించారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ..‘ఇలాంటి హ్యూమరస్ మూవీలో నటించాలని పదిహేనేండ్లుగా ఎదురుచూస్తున్నాను. దర్శకుడు రోహిత్ శెట్టి నా కల నెరవేర్చాడు. అతనితో ‘సర్కస్’, ‘సింబా’ చిత్రాల సీక్వెల్స్లో నటించాలని ఉంది’ అన్నారు. ఈ సినిమాలో దీపికా పడుకోన్ ఓ పాటలో మెరిసింది.