‘మా సంస్థ నుంచి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాల్ని అందించాం. కానీ ఓ చక్కటి ప్రేమకథను తీయలేకపోయామనే అసంతృప్తి ఉండేది. ‘సీతా రామం’ చిత్రంతో ఆ కోరిక తీరింది. వెండితెరపై అద్భుత ప్రేమకావ్యంగా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటుంది’ అని అన్నారు అగ్ర నిర్మాత అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతా రామం’. దుల్కర్సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వనీదత్ పాత్రికేయులతో సంభాషించారు. ఆ సంగతులివి..
మంచి ప్రేమకథా చిత్రం తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ‘సీతా రామం’తో ఆ కోరిక తీరింది. బాలచందర్ ‘మరో చరిత్ర’, మణిరత్నం ‘గీతాంజలి’ ప్రేమకావ్యాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. అదే తరహాలో ‘సీతారామం’ తెలుగు సినిమాల్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.
కరోనా ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా టికెట్ రేట్లను ఓసారి పెంచడం, మరోసారి తగ్గించడం వంటి అంశాలు కూడా ప్రేక్షకులపై ప్రభావం చూపించాయి. నిర్మాతలతో పాటు కొందరు అగ్రహీరోలు సీఎంలను కలిసి టిక్కెట్ రేట్లు పెంచాలని కోరడం అపార్థాలకు దారితీసింది.
తమ పారితోషికాలు పెంచుకోవడానికే హీరోలు టికెట్ రేట్లను పెంచమని అభ్యర్థిస్తున్నారనే తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దీనితో పాటు థియేటర్లలో స్నాక్స్, కూల్డ్రింక్స్ ధరల్ని ఇష్టారాజ్యంగా పెంచడం, మరోవైపు ఓటీటీల ప్రాబల్యంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందనుకుంటున్నా.
‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుంచి దుల్కర్ అంటే నాకు గౌరవం. అలాగే మమ్ముట్టిగారికి నేను పెద్ద అభిమానిని. ‘మహానటి’ సమయంలోనే ‘ప్రతి ఏడాది దుల్కర్తో ఓ సినిమా చేద్దాం’ అని నా కూతురు స్వప్నతో చెప్పాను. దర్శకుడు హను రాఘవపూడి ఈ కథ చెప్పగానే దుల్కర్ దగ్గరకు వెళ్లమని సూచించాను. జాతీయస్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అయ్యే లవ్స్టోరీ కావడంతో దుల్కర్ అయితేనే న్యాయం చేయగలడనిపించింది.
మా ఇద్దరమ్మాయిలు అద్భుత ప్రతిభావంతులు. స్వప్న సృజనాత్మకంగా ఆలోచిస్తుంది. ఒంటిచేత్తో నిర్మాణ వ్యవహారాల్ని పర్యవేక్షించే నేర్పు ఉంది. దాదాపు మా సంస్థ నిర్మాణ బాధ్యతల్ని వాళ్లకు అప్పగించినట్లేనని అనుకుంటున్నా.
సినిమా తాలూకు సాంకేతికాంశాలపై అతనికి మంచి పట్టుంది. ముఖ్యంగా కెమెరాను ఉపయోగించే విషయంలో ఆయన ప్రతిభ చూసి ముచ్చటేసింది. ‘సీతా రామం’ చిత్రాన్ని ఓ విజువల్ వండర్లా తీర్చిదిద్దాడు. కశ్మీర్ అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
ప్రభాస్తో చేస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ జనవరితో చిత్రీకరణ పూర్తిచేసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాం. అదే రేంజ్లో విడుదల చేయాలనుకుంటున్నాం. నాగచైతన్య హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాం. అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్తో ఓ సినిమా చర్చల్లో ఉంది. ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నాం.
నిర్మాతల మేలు కోసం ఆనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గిల్డ్ అవసరం ఏమొచ్చిందే తెలియదు. ఎవరైతే టికెట్ ధరలను పెంచమని డిమాండ్ చేశారో వాళ్లే ఇప్పుడు షూటింగ్స్ బంద్ చేయాలని అంటున్నారు. షూటింగ్స్ బంద్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏముంటుంది? అలాగే హీరోలు ట్రేడ్ విషయాల్లో ఇన్వాల్వ్ కావడం కూడా మంచిది కాదు.
మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. వారికి ఇష్టమొచ్చినట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారడం కూడా అర్థం లేనిది. అయితే సినిమా బిజినెస్కు సంబంధించిన సమస్యల విషయంలో గతంలో హీరోల జోక్యం ఉండేది కాదు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి వారు కూడా ఏ రోజూ ట్రేడ్ విషయాల్లో ఇన్వాల్వ్ కాలేదు. అలాంటి సమస్యల్ని ఫిల్మ్ ఛాంబర్ పరిష్కరించేది. ప్రస్తుతం తమ సమస్యల విషయంలో నిర్మాతల్లోనే పెద్ద కన్ఫ్యూజన్ ఉందనే భావన కలుగుతున్నది.