కె.విజయ్భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జిలేబి’. ఎస్ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. విజయ్భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయమవుతున్నాడు. శివాని రాజశేఖర్ కథానాయిక. శుక్రవారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు.
‘మా హాస్టల్లో ఉన్నది స్టూడెంట్స్ కాదు..వజ్రాలు..24 గంటలు చదువుతూనే ఉంటారు’ అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ వినోదాన్ని పండించింది. టీజర్ ఆద్యంతం హాస్యప్రధానంగా సాగింది. ‘ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్ ఉంటుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: కె.విజయ్భాస్కర్.