సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐక్యూ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)’. ఈ చిత్రాన్ని కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీ పతి నిర్మించారు. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకుడు. జూన్ 2న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ…
‘తెలివైన అమ్మాయిని కాపాడే అబ్బాయి కథ ఇది. యువతకు నచ్చే అంశాలుంటాయి. సైన్స్ నేపథ్యంగా కమర్షియల్ మూవీగా నిర్మించాం’ అన్నారు. దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ…‘ఓ యువ జంట మధ్య జరిగే కథను ఆసక్తికరంగా చూపిస్తున్నాం. కథ కథనాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.’ అన్నారు.