దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘లియో’. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్నది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్ర హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ైక్లెమాక్స్ ఘట్టాల్లో ఆ హీరో పాత్ర కథాగమనాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుందని చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం రామ్చరణ్ ఆ అతిథి పాత్రలో నటించబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ రామ్చరణ్ ‘లియో’ సినిమాలో భాగమైతే పాన్ ఇండియా స్థాయిలో రీచ్ ఉంటుందనేది దర్శకనిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు.