1990లలో జమ్మూకశ్మీర్లో తిరుగుబాటు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషితోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ఈ చిత్రంతో హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివాదాల మధ్య సక్సెస్ ఫుల్గా స్క్రీనింగ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ది కశ్మీర్ ఫైల్స్ ఇపుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
BRILLIANT NEWS:
On huge demand, #TheKashmirFiles is releasing in ISRAEL on 28th April. I thank Consul General @KobbiShoshani for coming to our studio to inaugurate the poster of TKF. It’s is a major step in sharing our coming goal of fighting terrorism and promoting humanity. pic.twitter.com/ZkDOexhIXp— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 20, 2022
ది కశ్మీర్ ఫైల్స్ ఏప్రిల్ 28న ఇజ్రాయెల్లో విడుదలవుతుందని చెప్పాడు. మా స్టూడియోకు వచ్చి ది కశ్మీర్ ఫైల్స్ పోస్టర్ ను లాంఛ్ చేసిన కాన్సూల్ జనరల్ కొబ్బి శొసానికి ధన్యవాదాలు. ఉగ్రవాదంపై పోరు చేసి, మానవత్వాన్ని చాటి చెప్పాలనే మా లక్ష్యం చేరడంలో ఇదొక గొప్ప ముందడుగు అని ట్వీట్ చేశాడు వివేక్ అగ్నిహోత్రి. పోస్టర్ రిలీజ్ వీడియోను ట్వీట్ చేశాడు. ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో ప్రీమియర్ కానుంది. ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్తోపాటు జీ5 కోప్రొడ్యూసర్గా వ్యవహరించింది.