ఇటీవలే ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేశారు టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal). వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) డైరెక్ట్ చేశాడు. 1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు..కలెక్షన్ వర్షం కురిపించింది.
ఇపుడు ఈ సినిమా మేకర్స్ తమ కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. మానవీయకోణంలో నిజాయితీతో కూడిన కథలతో రెండు సినిమాలు ప్రకటించారు మేకర్స్. తేజ్ నారాయణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త ప్రకటన చేసి..మూవీ లవర్స్ లో జోష్ నింపారు.
ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. అభిషేక్ అగర్వాల్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయనేదానిపై మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు.