కంటెంట్ ఉంటే పేరున్న కథానాయకులతో పనిలేదు అంటూ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నిరూపించింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలై భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. పోటీగా రాధేశ్యామ్ వంటి సినిమా ఉన్నా.. ఈ చిత్రం రాధేశ్యామ్కు రెట్టింపు కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది. ఈ చిత్రం శుక్రవారంతో 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మేకర్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
నిర్మాత అగర్వాల్ ట్విట్టర్ వేదికగా ‘ఇది నిజం యొక్క విజయం. ఇది మానవత్వం యొక్క విజయం. ఇది నిజంగా ప్రజల చిత్రం. చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా హింసించబడ్డారు? చంపబడ్డారు? వాళ్ళు స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా తెరకెక్కించాడు. రూ. 20కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.254.03 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం మే 13న ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జీ-5లో స్ట్రీమింగ్ కానుంది.
Today #TheKashmirFiles completes 50 days in theatres and still running successfully.
It’s a victory of Truth. It’s a victory of Humanity. It’s truly a people’s film.
Thanks everyone. #RightToJustice pic.twitter.com/Lyv9N81BVZ— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) April 29, 2022