మనుషులని పోలిన మనుషులు ఉండడం సహజం. ప్రపంచంలోమనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటుంటాం. అయితే మన సంగతేమో కాని సెలబ్రిటీల పోలికలతో ఉండేవారు తొందరగా వెలుగులోకి వస్తుంటారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్ మాదిరిగా స్నేహా ఉల్లాల్ ఉండగా, సమంత మాదిరిగా అషూ రెడ్డి ఉండగా వీరు ఇప్పుడు సినిమాలు,టీవీలలో సందడి చేస్తూ సెలబ్రిటీలుగా మారారు.
కత్రినా కైఫ్, అనుష్క శర్మ మాదిరిగా కూడా ఆ మధ్య పలువురు దర్శనమిచ్చారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పోలికలతో ఉన్న అమ్మాయి వార్తలలోకి ఎక్కింది. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన కియారా ఆ తర్వాత వినయ విధేయ రామలో నిరాశపరచి బాలీవుడ్కి వెళ్లింది. అక్కడ వరుస సినిమాలతో అదరగొడుతుంది.ఇప్పుడు రామ్ చరణ్ 15వ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది.
అయితే కియారాలా కనిపిస్తున్న యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య కాగా, ఈమె డెంటల్ డాక్టర్. ఇప్పుడు కియారా పోలికలతో ఉన్న ఐశ్వర్యకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తున్నాయి.