మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. ఈషాన్ సూర్య దర్శకుడు. సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ కథానాయికలు. ఈ నెల 21న విడుదలకానుంది. ఆదివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నటుడు మోహన్బాబు మాట్లాడుతూ ‘విష్ణు ఈ సినిమా కోసం చాలా శ్రమించాడు. రిస్కీ షాట్స్ చేశాడు. ‘ఢీ’ సినిమా కంటే పదిరెట్లు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అంతా కలిసి మంచి అవుట్పుట్ అందించడానికి కృషి చేశారు. ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశారు’ అని చెప్పారు. ‘కోన వెంకట్ వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది.
చోటా గారితో ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నా. ఈ సినిమాతో కుదిరింది. నా హార్ట్బీట్స్ అయిన అరియానా, వివియానా ఈ సినిమాలో తొలిసారి పాట పాడటం ఎంతో సంతోషంగా ఉంది. చక్కటి కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని మంచు విష్ణు తెలిపారు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మోహన్బాబు అన్నయ్య నాపై పెట్టిన బాధ్యత. ప్రతి యాక్టర్ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఈ సినిమా విష్ణు కెరీర్లో గొప్ప సెకండ్ ఇన్సింగ్స్కు నాంది పలుకుతుంది’ అన్నారు. సినిమా రషెష్ చూసినప్పుడు విజయం తథ్యమనే భావన కలిగిందని జి.నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.