అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతిశెట్టి నాయికగా నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక ప్రియమణి ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో తన పాత్రలతో మెప్పిస్తున్న కథానాయకుడు అరవింద్ స్వామితో పాటు శరత్కుమార్ కూడా ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో అలరించబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం కానున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, వారి తనయుడు యువన్ శంకర్ రాజా ఇద్దరు కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సమర్పణ: పవన్కుమార్.