Tamannah | నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉందని, సెలబ్రిటీలపై వచ్చే పుకార్లపై స్పందించకుండా ఉండటమే మంచిదని చెప్పింది అగ్ర కథానాయిక తమన్నా. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ ‘కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్.
ఏదైనా వార్తకు మనం అతిగా స్పందిస్తేనే అది సోషల్మీడియాలో వైరల్గా మారుతుంది. అందుకే నేను నెగెటివిటీకీ దూరంగా పూర్తిగా వృత్తి మీదనే దృష్టిపెట్టాను. ప్రేక్షకులు అంతిమంగా మనం చేసిన పాత్రలను, విజయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు’ అని చెప్పుకొచ్చింది. తనకు ఉత్తరాది, దక్షిణాది రెండు కళ్లలాంటివని..ఇప్పుడు రెండు చోట్లా మంచి అవకాశాలొస్తున్నాయని, అయితే సౌత్ సినిమాల ద్వారానే స్టార్డమ్ను సంపాదించుకున్నానని తమన్నా పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ‘అరాణ్మనై-4’, హిందీలో ‘వేద’ ‘స్త్రీ-2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.