Vaani kapoor on War 2 | బాలీవుడ్ స్టార్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నుంచి ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ 2019లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘వార్’ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో పాటు, టాలీవుడ్ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, నటి కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి పార్ట్లో నటించిన బాలీవుడ్ నటి వాణీ కపూర్ వార్ 2లో చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నా పాత్ర వార్ పార్ట్ 1లోనే ముగిసిపోయింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, టైగర్ ష్రాఫ్ నేను ఈ ముగ్గురం సీక్వెల్లో లేము. నేను, టైగర్ ఇద్దరం ‘వార్’లో చనిపోయాము. కాబట్టి టైగర్ తిరిగి వస్తే, నేను కూడా తిరిగి వస్తానంటూ చెప్పుకోచ్చింది వాణీ కపూర్. వాణీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న ‘మండల మర్డర్స్’ (Mandala Murders) అనే వెబ్ సిరీస్లో కీలక పాత్రల్లో నటిస్తుంది.