ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సానుకూల ఫలితాల్ని సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఏపీ ప్రభుత్వం మాకు అపాయింట్మెంట్ ఇస్తే పరిశ్రమ తరపున ముఖ్యమంత్రిని కలుస్తాం. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ సమస్యలు వేరుగా ఉన్నాయి. వాటన్నింటిని కమిటీ పరిశీలిస్తుందనే నమ్మకం ఉంది. ప్రభుత్వానికి, పరిశ్రమకు ఓ వారధిలా కమిటీ పనిచేస్తుందనుకుంటున్నాం. సినీరంగ సమస్యలపై ఎవరూ వ్యక్తిగతంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేయొద్దని మనవి చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఐదో ఆటకు అనుమతిచ్చింది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా పరిశీలించాలని కోరుతాం. తెలంగాణలో టికెట్ రేట్లను సవరించిన సీఎం కేసీఆర్గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇండస్ట్రీ తరపున త్వరలో సీఎంను కలవబోతున్నాం’ అన్నారు.