నందమూరి బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్తో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుకి మంచి రెస్పాన్స్ వస్తుంది. థమన్ తన బాణీలతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడని ప్రశంసిస్తున్నారు. ఆ బ్యాగ్రౌండ్ వింటుంటే పూనకాలు వస్తున్నాయని.. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే బీజీఎమ్ రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉందని చెబుతున్నారు.
తాజాగా ఓ థియేటర్లో లేడీ ఫ్యాన్స్ తో కలిసి చిందులేశాడు థమన్. స్క్రీన్ ముందు జై జై బాలయ్య సాంగ్ వస్తుండగా, ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం అంతటా థమన్ మ్యూజిక్ గురించి కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అమెరికాలోని సినీమార్క్ థియేటర్ లో సినిమా రిలీజ్ రోజు తమ థియేటర్లలో సౌండ్ను పరిమిత డెసిబిల్ కిందే ప్లే చేస్తామని నోటీసులో తెలిపారు.
మీరు మమ్మల్ని సౌండ్ పెంచమని అడగొడ్డు. మీ ఆనందం కోసం పెంచితే స్పీకర్స్ పాడవుతాయి. సౌండ్ మాత్రం పెంచలేము. దయచేసి అర్థం చేసుకోండి అని అన్నారు. ఇదే నోటీసును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన తమన్.. తగ్గేదే లే అని క్యాప్షన్ ఇచ్చారు.