దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శరత్కుమార్, ప్రభు, ప్రకాష్రాజ్, శ్రీకాంత్, జయసుధ వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, సంభాషణలు, అడిషనల్ స్క్రీన్ప్లే: వివేక్, ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత, కథ, స్క్రీన్ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.